udayabhanu: 'బిగ్ బాస్ 3'లో పార్టిసిపెంట్ గా ఉదయభాను .. భారీ పారితోషికం?

  • 'బిగ్ బాస్ 3'కి సన్నాహాలు
  • వ్యాఖ్యాతగా నాగార్జున
  • హౌస్ లోకి క్రేజ్ వున్న ఆర్టిస్టులు     

'స్టార్ మా' ఛానల్లో ప్రసారమైన 'బిగ్ బాస్' కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ రియాలిటీ షోకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో నాని వ్యాఖ్యాతగా 'బిగ్ బాస్ 2' ప్రసారమైంది. తనదైన శైలిలో నాని కూడా ఈ రియాలిటీ షోను రక్తికట్టించాడు. ఇక 'బిగ్ బాస్ 3' షోకి హోస్ట్ గా నాగార్జునను ఖరారు చేసుకున్నారు. 'బిగ్ బాస్ 2' విషయానికొస్తే పార్టిసిపెంట్స్ ఎంపిక విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. అందువలన 'బిగ్ బాస్ 3' పార్టిసిపెంట్స్ విషయంలో నిర్వాహకులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట.

మంచి క్రేజ్ వున్న వారిని మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆ జాబితాలో ఉదయభాను పేరు ఎక్కువగా వినిపిస్తోంది. యాంకర్ గా .. నటిగా ఉదయభానుకు మంచి క్రేజ్ వుంది. అందువలన ఆమెను  తీసుకున్నారని అంటున్నారు. ఎలిమినేట్ అయ్యేంతవరకూ రోజుకి 2 లక్షల పారితోషికం ఇస్తామని చెప్పేసి నిర్వాహకులు ఆమెను ఎంపిక  చేసుకున్నట్టు సమాచారం. ఈ సీజన్ లో అత్యధిక పారితోషికం తీసుకునేది ఆమెనేనని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. 

More Telugu News