ఇంటర్ బోర్డ్ కార్యాలయం నుంచి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కు విస్తరించిన నిరసనలు!

- ఇంటర్ ఫలితాల్లో గందరగోళం
- ఇప్పటివరకూ 18 మంది ఆత్మహత్య
- సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నం
- పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఇదిలావుండగా ఇంటర్ బోర్డ్ వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. మూడంచెల భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అనుమతించడం లేదు. మరోవైపు రీవాల్యుయేషన్ కు దరఖాస్తు గడువును రెండు రోజుల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫలితాల అంశం రాజకీయ రంగును పులుముకుంది. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని విపక్షాలు తీవ్ర విమర్శలకు దిగుతుంటే, విద్యార్థులను కాంగ్రెస్, బీజేపీలు రెచ్చగొడుతున్నాయని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.