Road Accident: ఔటర్ పై వేగంగా ఢీకొట్టుకున్న కార్లు.. 8 మందికి తీవ్రగాయాలు!

  • తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఘటన
  • కొత్వాల్ గూడ వద్ద ప్రమాదం
  • క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్వాల్ గూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు కార్లలోని 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వాహనదారులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. వీరిని హుటాహుటిన అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. కాగా, వీరందరికి ప్రస్తుతం చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News