sai tej: మారుతి దర్శకత్వంలో సాయితేజ్

  • 'చిత్రలహరి'తో హిట్ కొట్టిన తేజు 
  • మారుతి వినిపించిన కథకు గ్రీన్ సిగ్నల్ 
  • గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాణం

సాయిధరమ్ తేజ్ .. న్యూమరాలజీ ప్రకారం తన పేరును సాయితేజ్ గా మార్చుకున్నాడు. వరుస పరాజయాలతో సాయిధరమ్ తేజ్ సతమతమైపోతుంటే ఆయనకి ఈ సలహాను ఇచ్చింది దర్శకుడు మారుతినట. సాయితేజ్ గా పేరు మార్చుకున్నాక ఆయన చేసిన 'చిత్రలహరి'కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇక నుంచి సాయితేజ్ పేరుతోనే కొనసాగాలని ఆయన ఫిక్స్ అయ్యాడట.

ఈ నేపథ్యంలో సాయితేజ్ తదుపరి సినిమా ఎవరి దర్శకత్వంలో వుండనుందా అనే ఆసక్తి అందరిలోను తలెత్తింది. మారుతి దర్శకత్వంలోనే ఆయన సినిమా వుండనుందనేది తాజా సమాచారం. 'శైలజా రెడ్డి అల్లుడు' తరువాత మారుతి ఒక మంచి కథను సిద్ధం చేసుకున్నాడు. ఆ కథను సాయితేజ్ తో చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా వుండనుందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.

More Telugu News