Inter: ఇంటర్ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌, సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు గడువు పెంపు

  • ఇంటర్ బోర్డు వద్ద ఆందోళన
  • అన్యాయం చేశారన్న విద్యార్థులు
  • ఈ నెల 27 వరకూ గడువు పెంపు

ఇంటర్ బోర్డు ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అక్కడకు భారీగా చేరుకుని రెండో రోజూ ఆందోళన నిర్వహించారు. ఇంటర్‌లో తమకు అన్యాయం చేశారని, రీ-వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకుందామంటే వెబ్‌సైట్ ఓపెన్ కావడంలేదంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు స్పందించారు.

ఇంటర్‌ పేపర్‌ రీ-వెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు మరో రెండు రోజులు గడువు పెంచారు. దీంతో పాటు సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు కూడా మరో రెండు రోజుల పాటు గడువును పొడిగించారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈ నెల 27 వరకూ గడువు పొడిగించినట్టు అధికారులు తెలిపారు.

More Telugu News