nikhal: 'అర్జున్ సురవరం' కోసం 36 సార్లు చెంపదెబ్బలు తిన్నాను: హీరో నిఖిల్

  • ఈ సినిమాలో జర్నలిస్ట్ గా కనిపిస్తాను
  •  చెంపదెబ్బ సీన్ కి ఎక్కువ టేకులు
  •  ముఖ్య పాత్రల్లో పోసాని .. ప్రగతి    

నిఖిల్ కథానాయకుడిగా సంతోష్ దర్శకత్వంలో 'అర్జున్ సురవరం' నిర్మితమైంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాను గురించి నిఖిల్ స్పందించాడు.

" స్క్రిప్ట్ దశలో చిన్న సినిమాగా అనిపించింది .. కానీ సెట్స్  పైకి వెళ్లిన తరువాత పెద్ద సినిమా అయిపోయింది. ఈ సినిమాలో నేను జర్నలిస్ట్ గా కనిపిస్తాను. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను చెంపదెబ్బ కొట్టే సీన్ వుంది. ఆ పోలీస్ ఆఫీసర్ కొట్టగానే నేను ఫోర్స్ గా కింద పడిపోవాలి. ఆ షాట్ ని టైట్ క్లోజ్ లో తీయాలని డైరెక్టర్ చెప్పాడు. 36 టేకులకు ఆ షాట్ ఓకే అయింది. అన్నిసార్లు చెంపదెబ్బలు తినవలసి వచ్చిందన్న మాట. ఇక లావణ్య త్రిపాఠి చేతిలో కూడా నేను చెంపదెబ్బ తినే సీన్ వుంది. అదృష్టం కొద్దీ ఆ షాట్ ఒకే టేకులో ఓకే అయింది .. లేదంటే అయిపోయేవాడినే" అంటూ చెప్పుకొచ్చాడు. పోసాని కృష్ణమురళి .. నాగినీడు .. ప్రగతి ముఖ్యమైన పాత్రలను పోషించారు.

More Telugu News