Andhra Pradesh: మహారాష్ట్రపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి.. నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న టీడీపీ అధినేత!

  • ఇటీవల కర్ణాటకలో చంద్రబాబు ప్రచారం
  • తాజాగా మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి కూడా
  • ఇప్పటికే ముంబై బయలుదేరిన ఏపీ సీఎం

ఇటీవల కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి తరఫున ప్రచారం నిర్వహించిన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో పర్యటనకు సిద్ధమయ్యారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఇప్పటికే ముంబైకి బయలుదేరారు.

ఈ పర్యటనలో భాగంగా తొలుత ముంబైకి చేరుకున్న అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరులో ఉన్న లోపాలపై అఖిలపక్ష నేతలతో చంద్రబాబు చర్చిస్తారు. ఆ తర్వాత వీబీ చవాన్ కూడలిలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం విజయవాడకు చంద్రబాబు చేరుకుంటారు. ఏపీ ముఖ్యమంత్రి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకూ ప్రచారంలో పాల్గొంటారని అధికారిక వర్గాలు తెలిపాయి.

More Telugu News