modi mother: అమ్మ ఆశీర్వదించింది... ఆ తర్వాత తనూ ఓటేసింది: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని తల్లి

  • అహ్మదాబాద్‌ రైసాన్‌లో ఓటు వేసిన హీరాబెన్‌
  • సహాయకునితో వచ్చి వినియోగం
  • అంతకు ముందు మోదీకి ఆశీర్వాదం

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ ఈరోజు అహ్మదాబాద్‌లోని రైసాన్‌ పోలింగ్‌ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వార్థక్యంతో నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ సహాయకునితో కలిసి ఓపికగా పోలింగ్‌ బూత్‌కు వచ్చిన ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం తాను ఓటేసినట్టు ఎడమ చేయి చూపుడు వేలును మీడియా ప్రతినిధులకు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు తన వద్దకు వచ్చిన కొడుకు మోదీని హీరాబెన్‌ ఆశీర్వదించారు. ఆయనకు అల్పాహారం తినిపించి శాలువాను బహూకరించారు. అనంతరం మోదీ కూడా అహ్మదాబాద్‌లోని రనిప్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న విషయం తెలిసిందే.

More Telugu News