Telangana: విద్యార్థుల ఆత్మహత్యలపై నటి పూనమ్ కౌర్ ఆవేదన

  • తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు
  • బిల్డింగ్ పై నుంచి దూకేసిన ఓ విద్యార్థి
  • ట్విట్టర్ లో స్పందించిన నటి పూనమ్ కౌర్

తెలంగాణలో ఇంటర్ ఫలితాల గోల్ మాల్ వ్యవహారంలో 17 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు  ప్రముఖులు ఈ విషయమై మాట్లాడుతున్నారు. తాజాగా సినీ నటి పూనమ్ కౌర్ ఈ వ్యవహారంపై స్పందించారు. ‘తెలంగాణ ఇంటర్ విద్యార్థులు ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు.

ఓ పిల్లాడు బిల్డింగ్ పైన నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మెరిట్ విద్యార్థి అయినప్పటికీ పరీక్షల్లో ఓ మార్కుతో ఫెయిల్ కావడంతో అతను ఈ  నిర్ణయం తీసుకున్నాడట. అంతకుముందు ఉస్మానియా విశ్వవిద్యాలయం దగ్గర ఇలాంటి ఘటనే జరిగింది. ఇంటర్ విద్యార్థుల భద్రతపై ఆందోళన చెందుతున్నా’ అని పూనమ్ కౌర్ ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News