YSRCP: తూర్పుగోదావరి జిల్లాలో కర్రలతో దాడి చేసుకున్న వైసీపీ-టీడీపీ కార్యకర్తలు.. ఉద్రిక్తత

  • దాడిలో కానిస్టేబుల్‌కు గాయాలు
  • గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత
  • మోహరించిన పోలీసులు

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలోని హుస్సేన్‌పురంలో టీడీపీ-వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడులు చేసుకున్నారు. మొదట చిన్నగా మొదలైన గొడవ పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. కర్రలతో ఇరువర్గాలు తలపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ వినోద్‌కు కర్ర తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో  పోలీసులు  మోహరించారు.

More Telugu News