Digvijay Singh: ఎన్నికల ప్రచారంలో దిగ్విజయ్‌కు షాక్.. మోదీని పొగిడిన కాంగ్రెస్ కార్యకర్త!

  • భోపాల్‌లో ఎన్నికల ప్రచారం
  • మోదీని తీవ్ర స్థాయిలో విమర్శించిన డిగ్గీ రాజా 
  • సర్జికల్ స్ట్రయిక్స్ ను కీర్తించిన కార్యకర్త 

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ కార్యకర్త నుంచే షాక్ తగిలింది. భోపాల్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న డిగ్గీ రాజా ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అనంతరం ఒక యువ కాంగ్రెస్ కార్యకర్తకు మైక్ ఇచ్చి మోదీ గురించి మాట్లాడమనడంతో, ఆ యువకుడు మైక్ తీసుకుని, మోదీ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించారని, ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారంటూ కీర్తించడం మొదలు పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడింది. ఈ ఘటనతో  అప్రమత్తమైన నేతలు యువకుడి చేతిలోని మైక్‌ని లాక్కొని వేదిక నుంచి దించేశారు.

More Telugu News