Sri Lanka: శ్రీలంకలో.. బాంబు నిర్వీర్యం చేస్తుండగా పేలుడు!

  • కొచ్చి కేడ్ లోని సెయింట్ ఆంథోనీస్ చర్చి వద్ద ఘటన
  • ఉగ్రదాడుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ 
  • రేపు సంతాప దినంగా ప్రకటించిన ప్రభుత్వం 

శ్రీలంకలో మరో బాంబు పేలుడు సంభవించింది. కొచ్చి కేడ్ లోని సెయింట్ ఆంథోనీస్ చర్చి వద్ద ఉన్న వ్యానులో ఉంచిన బాంబును నిర్వీర్యం చేస్తుండగా పేలింది. కొలంబో బస్టాండ్ వద్ద 87 బాంబు డిటోనేటర్లను పోలీసులు గుర్తించారు. కాగా, శ్రీలంకలో ఉగ్రదాడుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రేపు సంతాప దినంగా ప్రకటించింది.

More Telugu News