rajasekhar: భారీ రేటుకు 'కల్కి' థియేటర్ రైట్స్

  • రాజశేఖర్ హీరోగా రూపొందిన 'కల్కి'
  • టీజర్ తో పెరిగిన అంచనాలు 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  

రాజశేఖర్ కథానాయకుడిగా 'కల్కి' సినిమా రూపొందుతోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఆదా శర్మ నాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన టీజర్, ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఈ సినిమా కంటెంట్ చాలా వైవిధ్యభరితమైనదనే విషయాన్ని ఆ టీజర్ స్పష్టం చేయగలిగింది. ఈ ఒక్క టీజర్ తో ప్రపంచవ్యాప్త థియేటర్ రైట్స్ విషయంలో పోటీ ఏర్పడింది.

చివరికి ఈ సినిమా థియేటర్ రైట్స్ ను నిర్మాత రాధామోహన్ 12 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా సమాచారం. ఈ సినిమా థియేటర్ రైట్స్ కొనుగోలుతో, తెలుగులోను తన సంస్థ 'వండర్ బార్' కార్యకలాపాలను వేగవంతం చేయాలని హీరో ధనుశ్ భావించాడట. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ కి గాను ఆయన భారీ రేటుని ఆఫర్ చేశాడట. అయితే అప్పటికే రాధా మోహన్ తో అగ్రిమెంట్ అయిపోయిందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Telugu News