TS RTC: బ్రేక్‌ లైనర్లు పట్టేయడంతో టీఎస్‌ ఆర్టీసీ బస్సులో మంటలు

  • డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం
  • మంటలు గమనించి బస్సు ఆపి ప్రయాణికుల దించివేత
  • సమీపం నుంచి నీరు తెచ్చి మంటలు ఆర్పివేత

వేగంగా వెళ్తున్న బస్సు బ్రేక్‌ లైనర్లు పట్టేయడంతో మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే...టీఎస్‌ ఆర్టీసీకి చెందిన ఓ బస్సు బోధన్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్తోంది. బస్సు మేడ్చల్‌లోని ఐటీఐ వద్దకు రాగానే బ్రేక్‌ లైనర్లు పట్టేయడంతో టైర్ల వద్ద మంటలు చెలరేగి పొగలు వచ్చాయి. దీన్ని గమనించిన బస్సు డ్రైవర్‌ రాజు వెంటనే బస్సును నిలిపివేసి ప్రయాణికులను దించివేశారు. సమీపంలోని హోటల్‌ వద్ద నుంచి నీరు తెచ్చి మంటలు వచ్చిన ప్రాంతంలో పోయడంతో ఆరిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణిస్తున్నారు. మంటలు గమనించకుంటే పెద్ద ప్రమాదమే జరిగేదని అంటున్నారు.

More Telugu News