Karnataka: శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ నేతల మృతి: అధికారికంగా ప్రకటించిన సుష్మాస్వరాజ్

  • మరో ఐదుగురి ఆచూకీ కోసం యత్నాలు
  • ఈనెల 20న  కొలంబో వెళ్లిన కర్ణాటక నాయకులు 
  • ద షాంగ్రిలా హోటల్‌లో బస... అక్కడే పేలుళ్లు

కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీలంక విహార యాత్రకని వెళ్లిన ఏడుగురు జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌) నాయకుల్లో ఇద్దరు చనిపోయినట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. రెండో విడత ఎన్నికల తర్వాత ఈనెల 20న ఈ ఏడుగురు నాయకులు శ్రీలంకకు వెళ్లారు. అక్కడి ద షాంగ్రిలా హోటల్‌లోని రెండు గదులు అద్దెకు తీసుకుని బస చేశారు. నిన్న శ్రీలంకలో ఎనిమిది చోట్ల జరిగిన వరుస పేలుళ్లలో ద షాంగ్రిలా హోటల్‌ కూడా ఒకటి. ఈ పేలుడు అనంతరం ఈ ఏడుగురి నేతల ఆచూకీ తెలియకుండా పోవడంతో ఆందోళన నెలకొంది. ఇద్దరు చనిపోయినట్లు తేలడంతో మిగతా వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా, నేతల మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

More Telugu News