Sri Lanka: శ్రీలంక పేలుళ్ల ఘటనను వీడియో తీసిన కారులోని వ్యక్తి.. సోషల్ మీడియాలో వైరల్

  • 200 మందికి పైగా మృతి
  • పెరుగుతున్న మృతుల సంఖ్య
  • ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు
  • రెండు చోట్ల ఆత్మాహుతి దాడులు

ఈస్టర్ సందర్భంగా శ్రీలంకలో భారీ విధ్వంసం జరిగింది. ఈ దారుణ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ 200 మందికి పైగా మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. రెండు చోట్ల ఆత్మాహుతి దాడులు జరగ్గా, నాలుగు చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

ఈ ఘటనలో ఐసిస్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకూ ఎనిమిది చోట్ల బాంబు దాడులు జరిగాయి. అయితే కోచొకడేలోని సెయింట్ ఆంటోని చర్చిలో జరిగిన పేలుడు ఘటనను కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.

More Telugu News