Venkaiah Naidu: వెంకయ్యనాయుడు కోసం సరికొత్త రైలు బోగీ తయారుచేసిన దక్షిణ రైల్వే

  • బోగీలో ఫైవ్ స్టార్ సదుపాయాలు
  • ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇంజినీర్లు
  • ఉపరాష్ట్రపతి ప్రయాణానికి అనువుగా భద్రతా ఏర్పాట్లు

దక్షిణ రైల్వే శాఖ ఇంజినీర్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోసం ప్రత్యేకంగా ఓ రైలు బోగీని తయారుచేశారు. దీంట్లో ఫైవ్ స్టార్ తరహాలో సౌకర్యాలు ఉంటాయి. విలాసానికి మారుపేరుగా నిలవడమే కాకుండా, అత్యాధునిక సదుపాయాలతో నడిచే కార్యాలయంలా ఈ బోగీ ఉండనుంది. వెంకయ్యనాయుడు ఈ నెల 23న చెన్నై, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

చెన్నైలోని త్రిశూలం రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరనున్న ఆయన ఈ ఆధునిక కోచ్ లో తడ వెళ్లి అక్కడ శ్రీసిటీలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడి నుంచి మహాబలిపురంలోని ఓ ప్రైవేటు యూనివర్శిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఆపై మరికొన్ని కార్యక్రమాలకు ఆయన హాజరు కావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో, వెంకయ్యనాయుడు ప్రయాణాలకు అనువుగా ఉంటుందని ఈ ప్రత్యేక రైలుబోగీని దక్షిణ రైల్వే శాఖ రూపొందించింది. దీంట్లో, ఉపరాష్ట్రపతి స్థాయికి తగిన విధంగా భద్రత ఏర్పాట్లు కూడా ఉంటాయని తెలుస్తోంది.

More Telugu News