Telangana: పెళ్లి చేసుకోవాలని ప్రియురాలి ఒత్తిడి.. స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసిన ప్రియుడు!

  • తెలంగాణలోని హైదరాబాద్ లో ఘటన
  • కొత్తపేటకు చెందిన మహిళతో మనోజ్ కు పరిచయం
  • కొన్ని నెలలుగా సహజీవనం చేస్తున్న జంట

నిన్ను ప్రేమిస్తున్నా అంటూ మాయమాటలు చెప్పాడు. జీవితాంతం కలిసి ఉందామని లోబర్చుకున్నాడు. తీరా కోరిక తీరాక పెళ్లి చేసుకోమంటే  స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ లోని కొత్తపేటకు చెందిన ఓ మహిళ(32) మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో ఏజెంట్ గా పనిచేసేది. రెండేళ్ల క్రితం ఆమె విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలో మన్సురాబాద్ కు చెందిన సీసీటీవీలు అమ్మే వ్యాపారి మనోజ్ కుమార్ తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు కొన్నినెలలుగా కలిసి సహజీవనం చేస్తున్నారు.

ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని సదరు మహిళ మనోజ్ ను ఒత్తిడి చేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి స్నేహితులు కొలను సిద్దార్థరెడ్డి, సతీష్, బాబీ, జంగారెడ్డితో కలిసి మనోజ్ పూటుగా మద్యం సేవించాడు. ఈ సందర్భంగా ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం స్నేహమైనగర్‌ కాలనీకి రావాల్సిందిగా ఫోన్ లో చెప్పాడు.

అక్కడికి బాధితురాలు చేరుకోగానే మనోజ్ తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే వీరి బారినుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

More Telugu News