prabhas: మళ్లీ 'సాహో' సెట్ కి వచ్చేసిన ప్రభాస్

  • ముంబైలో తాజా షెడ్యూల్ షూటింగ్
  • కీలక సన్నివేశాల చిత్రీకరణ 
  • ఆగస్టు 15వ తేదీన విడుదల          

ప్రభాస్ తాజా చిత్రంగా 'సాహో' రూపొందుతోంది. సుజిత్ దర్శకత్వంలో .. భారీ బడ్జెట్ లో ఈ సినిమా నిర్మితమవుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగుకి బ్రేక్ ఇచ్చారు. ఈ సమయంలో 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ రూపొందిస్తోన్న సినిమా షూటింగులో ప్రభాస్ పాల్గొన్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా పూజా హెగ్డే నటిస్తోంది.

మళ్లీ ఇప్పుడు 'సాహో' సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ముంబైలో మొదలైన ఈ షూటింగులో ప్రభాస్ జాయిన్ అయ్యాడు. ప్రభాస్ .. తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రభాస్ కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరడం ఖాయమనేది ఆయన అభిమానుల మాట. వివిధ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా, ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. 

More Telugu News