hardhik patel: చెంప ఛెళ్లుమనిపించిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన హార్దిక్ పటేల్

  • గుజరాత్ లో ఓ ర్యాలీలో ప్రసంగిస్తుండగా హార్దిక్ పై దాడి
  • దాడి చేసిన వ్యక్తిని చితకబాదిన పార్టీ కార్యకర్తలు
  • చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన హార్దిక్

పటిదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్ ప్రసంగిస్తుండగా ఆయన చెంపను ఓ వ్యక్తి ఛెళ్లుమనిపించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఓ సభలో ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు హార్దిక్ ఫిర్యాదు చేశారు. తన పట్ల అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో హార్దిక్ కోరారు.

మరోవైపు, ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే... సదరు వ్యక్తిపై పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. పక్కకు లాక్కెళ్లి, చితక్కొట్టారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

More Telugu News