Telangana: భార్యను పుట్టింటికి తరిమేసి మరో యువతితో అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చావగొట్టిన భార్య!

  • తెలంగాణలోని భద్రాద్రి జిల్లాలో ఘటన
  • పిల్లలు పుట్టలేదని భార్యకు వేధింపులు
  • ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టిన యువతి బంధువులు

పిల్లలు పుట్టలేదని ఓ ప్రబుద్ధుడు తన భార్యను వేధింపులకు గురిచేశాడు. వీటిని తాళలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోగానే, మరదలు వరసయ్యే ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు భార్య అతడిని చితక్కొట్టింది. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరంలో సాంబశివరావు, అదే ప్రాంతానికి చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ దంపతులకు పిల్లలు పుట్టకపోవడంతో భార్యను వేధించుకుని తినడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులు హద్దు దాటడంతో బాధితురాలు పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సాంబశివరావు తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న భార్య పోలీసులను ఆశ్రయించింది. బంధువుల సాయంతో భర్తను ఇంటి నుంచి బయటకు లాక్కునివచ్చింది. అనంతరం కుటుంబ సభ్యుల సాయంతో చితక్కొట్టింది. మరోవైపు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News