Andhra Pradesh: బాలకృష్ణ హీరోగా కొత్త సినిమా తీయబోతున్నా!: దర్శకుడు బోయపాటి శ్రీను

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి
  • కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి సేవ
  • కొత్త సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశాభావం

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు ఆయనకు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం బోయపాటి మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా కొత్త సినిమా ప్రారంభం కాబోతోందని తెలిపారు. సింహా,లెజెండ్ తరహాలో ఈ సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మిలిగిన వివరాలను త్వరలోనే చెబుతామని పేర్కొన్నారు.

More Telugu News