siddharth: 'అంధాదున్' రీమేక్ లో సిద్ధార్థ్, త్రిష

  • హిందీలో హిట్ కొట్టిన 'అంధాదున్'
  • తమిళ రీమేక్ కి సన్నాహాలు 
  • రాధికా ఆప్టే పాత్రలో త్రిష  

సిద్ధార్థ్ .. త్రిష జంటగా 13 యేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సంచలన విజయాన్ని సాధించింది. ప్రేమకథా చిత్రాలను కొత్త కోణం వైపుకు మళ్లించింది. ఈ సినిమాలో చూడముచ్చటైన జంటగా కనువిందు చేసిన సిద్ధార్థ్ - త్రిష ఇద్దరూ మళ్లీ ఇంతకాలానికి కలిసి నటించనున్నట్టు తెలుస్తోంది.

క్రితం ఏడాది హిందీలో విడుదలై ఘన విజయాన్ని అందుకున్న 'అంధాదున్' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ కథలో ఒక ప్రధానమైన పాత్ర కోసం సిద్ధార్థ్ ను ఎంపిక చేసుకున్నారు. మరో ప్రధానమైన పాత్రకి గాను త్రిషను సంప్రదించారనీ .. ఈ సినిమా చేయడానికి ఆమె అంగీకరించారని అంటున్నారు. హిందీలో రాధికా ఆప్టే చేసిన పాత్రను త్రిష చేయనుందని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా సిద్ధార్థ్ చెప్పడం విశేషం.

More Telugu News