anushka: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నయనతార స్థానంలో అనుష్క 
  • బరువు పెంచుతున్న రవితేజ 
  • పౌరహక్కుల కోసం పోరాడే టబు

*  ప్రముఖ నటి అనుష్క త్వరలో మణిరత్నం దర్శకత్వంలో నటించనుంది. 'పొన్నియన్ సెల్వం' పేరిట మణిరత్నం రూపొందించనున్న చారిత్రాత్మక కథా చిత్రంలో కీలక పాత్రకు మొదట నయనతారను తీసుకున్నారు. అయితే, ఆమెకు డేట్స్ సమస్య తలెత్తడంతో ఇప్పుడా పాత్రకు అనుష్కను తీసుకుంటున్నట్టు సమాచారం.
*  రవితేజ తాజాగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కో రాజా' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం కూడా చేస్తున్నాడు. కాగా, ఇందులో కొడుకు పాత్ర కోసం రవితేజ మరింత బరువు పెంచనున్నాడట. ఇందుకోసం జిమ్ లో ప్రస్తుతం వర్కౌట్స్ చేస్తున్నాడు.    
*  ప్రముఖ నటి టబు చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు చిత్రాలలో నటించడానికి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రానా, సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో నటించనుంది. పౌరహక్కుల కోసం పోరాడే ఒక ప్రొఫెసర్ పాత్రలో ఆమె ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తుందట.

More Telugu News