Andhra Pradesh: ఫోన్ల ట్యాపింగ్ కోసం ఏపీ ప్రభుత్వం కొన్ని పరికరాలు కొనుగోలు చేసింది: సీఎస్ కు విజయసాయిరెడ్డి లేఖ

  • ఇజ్రాయెల్ కు చెందిన సంస్థ వద్ద కొనుగోలు చేశారు
  • వాటి కొనుగోలుకు రూ.12.5 కోట్లు ఖర్చు చేశారు
  • ప్రతిపక్ష నేతల, ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాప్ చేసే దురుద్దేశం

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు ఓ లేఖ రాశారు. ఇజ్రాయెల్ దేశానికి చెందిన వెరింట్ సంస్థ వద్ద ఏపీ ప్రభుత్వం కొన్ని పరికరాలు, సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఆ పరికరాల కొనుగోలు నిమిత్తం ఆ సంస్థకు రూ.12.5 కోట్లు ఖర్చు చేసినట్టు ఆరోపించారు.

ఆ సంస్థకు చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేయాలని ఆయన కోరారు. ఈ పరికరాలు కొనుగోలు చేసే ముందు నిపుణుల అభిప్రాయం తీసుకోకుండా, ఏకపక్షంగా దురుద్దేశ పూర్వకంగా వీటిని కొనుగోలు చేసిందని అన్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు, ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసే నిమిత్తమే ఈ పరికరాలను కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించిన బిల్లులకు సొమ్ము చెల్లించే ముందు ఆయా పరికరాల వివరాలను పరిశీలించాలని ఆ లేఖలో విజయసాయిరెడ్డి కోరారు.

More Telugu News