BJP: జీవీఎల్ పై దాడి వెనుక ఎవరున్నా చర్యలు తీసుకోవాలి: బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి

  • జీవీఎల్ పై దాడిని ఖండిస్తున్నాం
  • ఇలాంటి చర్యలతో మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు
  • ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై చెప్పు విసిరిన సంఘటనపై ఆ పార్టీ నాయకుడు ఎన్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ దాడిని ఏపీ బీజేపీ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి చర్యల ద్వారా బీజేపీ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. బీజేపీపై కుట్ర పూరితమైన చర్యల్లో భాగంగానే ఈ ఘటన జరిగిందని అన్నారు. ఈ ఘటన వెనుక ఎంతటి వారున్నా వారిపై చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

More Telugu News