Narasimhan: ఏపీలో ఎన్నికల అనంతర పరిణామాలపై సీఈసీ ఆరా.. డీజీపీ నివేదికను పంపిన ద్వివేది!

  • జగన్ ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ పరిస్థితులపై ఆరా
  • శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్న ద్వివేది
  • ఈవీఎంల తరలింపుపై మరోసారి వివరణ కోరుతాం

ఏపీలో శాంతిభద్రతలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇటీవల గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఎన్నికల అనంతరం ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరా తీసింది. ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయంటూ రాష్ట్ర డీజీపీ ఇచ్చిన నివేదికను గోపాలకృష్ణ ద్వివేది సీఈసీకి పంపారు.

దీంతో పాటు ఈ నెల 10న తనకూ, చంద్రబాబుకు మధ్య జరిగిన సంభాషణ తాలూకు వీడియోను ఇంగ్లీషులోకి అనువదించి సీఈసీకి ద్వివేది పంపించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో ఈవీఎంల తరలింపుపై మరోసారి ఆ జిల్లా కలెక్టర్‌ను వివరణ కోరుతామని ద్వివేది తెలిపారు.

More Telugu News