India: ముగిసిన రెండో విడత పోలింగ్

  • 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికలు
  • తమిళనాడులో ఇంకా కొనసాగుతున్న పోలింగ్
  • ఈ నెల  23న మూడో విడత పోలింగ్  

దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ రోజు జరిగిన రెండో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆయా రాష్ట్రాల్లో ఈ రోజు సాయంత్రం ఐదు గంటలతో పోలింగ్ సమయం ముగిసింది. అయితే, తమిళనాడులోని 38 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 వరకు, మధురైలో 8 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ సమయం ముగిసింది. కాగా, రెండో విడత లోక్ సభ ఎన్నికలు 11 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగాయి. ఈ నెల  23న మూడో విడత పోలింగ్ 113 లోక్ సభ స్థానాలకు జరగనుంది.

More Telugu News