Andhra Pradesh: మోదీ ప్రజాకర్షణను చూసి ఓర్వలేకే జీవీఎల్ పై చెప్పుతో దాడిచేయించారు!: కన్నా లక్ష్మీనారాయణ

  • జీవీఎల్ పై దాడిని ఖండించిన కన్నా
  • బీజేపీ అభివృద్ధి విధానాలను కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని విమర్శ
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్

బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై ఈరోజు ఢిల్లీలో శక్తి భార్గవ అనే వ్యక్తి చెప్పు విసిరిన సంగతి తెలిసిందే. ఈ చెప్పు దాడి నుంచి త్రుటిలో జీవీఎల్ తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జీవీఎల్ పై జరిగిన దాడిని ఖండించారు. ఈ దాడి వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించారు. ఇలాంటి దాడులు బీజేపీ నేతల ఆత్మస్థైర్యాన్ని తగ్గించలేవని స్పష్టం చేశారు.

కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ @GVLNRAO గారిపై ఆగంతకుడి దాడిని ఖండిస్తున్నాను. ఇది బీజేపీ అభివృద్ధి విధానాలను, మోదీ గారి ప్రజాకర్షణను చూసి ఓర్వలేని కాంగ్రెస్ ప్రేరేపిత చర్య. ఇలాంటి చర్యలు బీజేపీ నేతల స్థైర్యాన్ని తగ్గించలేవు’ అని ట్వీట్ చేశారు.

More Telugu News