chattisgargh: నెత్తురోడిన ఛత్తీస్ గఢ్.. ఇద్దరు మావోలను కాల్చిచంపిన భద్రతాబలగాలు!

  • ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో ఘటన
  • ధనికార్కా అడవుల్లో కూంబింగ్
  • ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భద్రతాబలగాలు ఇద్దరు మావోయిస్టులను హతమార్చగా, మిగతావారు ఘటనాస్థలి నుంచి పరారయ్యారు.

పోలింగ్ నేపథ్యంలో జిల్లా రిజర్వు గార్డులు దంతెవాడలోని ధనికార్కా అడవుల్లో గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతాబలగాలకు, మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాలు కాల్పులు జరుపుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో బలగాలు సురక్షితంగా బయటపడ్డాయి. పరారైన మావోలను ఏరివేసేందుకు ఉన్నతాధికారులు కూంబింగ్ ను ముమ్మరం చేశారు.

More Telugu News