polavaram project: ‘పోలవరం’పై రివ్యూ పేరిట కమీషన్లు తీసుకునే యత్నం: చంద్రబాబుపై అంబటి ఆరోపణలు

  • పోలవరం ప్రాజెక్టుపై ఆయన రివ్యూ ఎలా చేస్తారు?
  • ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రివ్యూ చేయొచ్చా?
  • చట్టం ఎలా అంగీకరిస్తుంది?

పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం సమీక్షించిన విషయం తెలిసిందే. దీనిని వైసీపీ నేత అంబటి రాంబాబు తప్పబట్టారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టుపై రివ్యూ ఎలా చేస్తారు? చట్టం ఎలా అంగీకరిస్తుంది? అని ప్రశ్నించారు. రివ్యూ పేరుతో అందరినీ పిలిచి రావాల్సిన కమీషన్లు అన్నీ తీసుకునేందుకు చూస్తున్నారని ఆరోపించారు. రివ్యూల పేరుతో దండుకోవాలని చూస్తే, చట్టం ఊరుకోదని అన్నారు.

More Telugu News