rajani: రజనీతో విలన్ గా తలపడనున్న బాలీవుడ్ నటుడు

  • మురుగదాస్ తాజా చిత్రంగా 'దర్బార్'
  • ప్రతినాయకుడిగా ప్రతీక్ బబ్బర్
  •  వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు       

రజనీకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' రూపొందుతోంది. ఇటీవలే ముంబైలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రధాన పాత్రధారులకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను తీసుకున్నారు. దాంతో ఈ ప్రాజెక్టుపై మరింతగా క్రేజ్ పెరిగింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరు? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. మురుగదాస్ ఈ మధ్య తన సినిమాల్లో విలన్స్ ను బాలీవుడ్ నుంచి తీసుకుంటున్నాడు. అందువలన .. ఈ సినిమాకి కూడా అలాగే చేయవచ్చనే టాక్ వచ్చింది. అనుకున్నట్టుగానే ఆయన బాలీవుడ్ నటుడినే విలన్ గా తీసుకున్నాడు. స్మితాపాటిల్ - రాజ్ బబ్బర్ తనయుడైన ప్రతీక్ బబ్బర్ ను విలన్ పాత్ర కోసం తీసుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఆయన ఈ సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడట. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News