venkatesh: 100 మంది జూనియర్ ఆర్టిస్టులతో 'వెంకీమామ'

  • బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ'
  • వినోదభరితంగా సాగే కథ 
  • దసరాకి విడుదల చేసే అవకాశం

వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా 'వెంకీమామ' సినిమా రూపొందుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్ .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ .. చైతూ జోడిగా రాశి ఖన్నా నటిస్తున్నారు.

ఇటీవలే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. రెండవ షెడ్యూల్ షూటింగు హైదరాబాద్ -  రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రాజకీయాల నేపథ్యంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. వెంకటేశ్ .. నాగచైతన్యలతో పాటు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ ఎపిసోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఈ వినోద భరిత చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 

More Telugu News