father: మూడేళ్లుగా నాపై మా నాన్న అత్యాచారం చేస్తున్నాడు: పోలీసులను ఆశ్రయించిన తెలంగాణ బాలిక

  • రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక
  • తల్లితో పాటు వచ్చి ఫిర్యాదు
  • పరారీలో బాలిక తండ్రి

గత మూడేళ్లుగా తన తండ్రి తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీసులకు ఓ 16 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేసింది. తన తండ్రి నుంచి తన తల్లి విడిపోయి, వేరుగా నివసిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. మూడేళ్ల క్రితం తొలిసారి తనపై బలవంతంగా అత్యాచారం చేశాడని తెలిపింది.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, కొన్ని రోజుల క్రితం బాధితురాలు తన తండ్రి వద్ద నుంచి పారిపోయి... తల్లి వద్దకు వెళ్లిందని చెప్పారు. నిన్న తన తల్లితో పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసిందని తెలిపారు. బాలిక తండ్రిపై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), పోస్కో చట్టం (లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించే చట్టం) కింద కేసు నమోదు చేశామని చెప్పారు. బాలిక తండ్రి పరారీలో ఉన్నాడని... అతనిని పట్టుకునేందుకు స్పెషల్ టీములను రంగంలోకి దించామని తెలిపారు. 

More Telugu News