chaitu: వసూళ్ల పరంగా కొనసాగుతున్న 'మజిలీ' దూకుడు

  • చైతూ జోష్ పెంచిన 'మజిలీ'
  • నైజామ్ ఏరియా వసూళ్లే 10 కోట్లు
  •  నాగ్ దృష్టిలో పడిన శివ నిర్వాణ    

నాగచైతన్య .. సమంత .. దివ్యాన్ష కౌశిక్ ప్రధాన పాత్రధారులుగా 'మజిలీ' సినిమా నిర్మితమైంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ సినిమా కోసం ఖర్చు చేసిన మొత్తం 21 కోట్లు అట. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల వసూళ్లుగా రాబట్టిన మొత్తం 30 కోట్లు అని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 24 కోట్ల వరకూ వసూలు చేసింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఇంతవరకూ 10 కోట్లను వసూలు చేయడం విశేషం. కొంత కాలంగా వరుస పరాజయాలతో డీలాపడిన చైతూకి, ఈ సినిమా విజయం ఫుల్ జోష్ ను ఇచ్చేసిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాతో శివ నిర్వాణ .. నాగ్ దృష్టిలో పడ్డాడనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. అఖిల్ సినిమా చేసే ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి మరి. 

More Telugu News