Andhra Pradesh: ఏపీలోని ఓ ఈవీఎంలో అదనంగా 50 ఓట్లు.. ఎమ్మార్వోను సస్పెండ్ చేసిన ఈసీ!

  • కృష్ణా జిల్లాలో ఎన్నికల వేళ విచిత్రం
  • మాక్ పోలింగ్ నిర్వహించిన అధికారులు
  • ఆ ఓట్లను తొలగించకుండానే పోలింగ్ మొదలు

కృష్ణా జిల్లాలో ఈవీఎంల నిర్వహణ విషయంలో అధికారులపై ఈసీ కొరడా ఝుళిపించింది. జిల్లా సబ్ కలెక్టర్ స్వప్నిల్‌ దినకర్‌కు షోకాజ్ నోటీసులు జారీచేసింది. అలాగే నూజివీడు ఎమ్మార్వో తేజేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసింది. నూజివీడులోని ఓ పోలింగ్ బూత్ లో మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం ఆ ఓట్లను తొలగించకుండానే అధికారులు పోలింగ్ ప్రారంభించారు.

దీంతో అక్కడి ఓటర్ల సంఖ్య కంటే 50 ఓట్లు అదనంగా పడినట్లు ఈవీఎంల్లో కనిపించింది. ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ, సబ్ కలెక్టర్ దినకర్ తో పాటు ఎమ్మార్వో తేజేశ్వరరావుపై చర్యలు తీసుకుంది.

More Telugu News