Gujarath: ఉత్తరాదిలో భారీ వర్షాల కారణంగా 31 మంది మృతి

  • ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలు
  • ఎంపీ, గుజరాత్, రాజస్థాన్ లలో 31 మంది దుర్మరణం
  • తీవ్రంగా నష్టపోయిన రైతులు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాల కారణంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లో 16 మంది, గుజరాత్ లో 9 మంది, రాజస్థాన్ లో ఆరుగురు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని, రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాజస్థాన్ లోని శ్రీగంగా నగర్, పిలానీ, అజ్మేర్, చిత్తోర్ ఘర్ ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.

More Telugu News