Andhra Pradesh: చంపేస్తామని బెదిరింపులు.. టీడీపీ నేత బోండా ఉమపై కేసు నమోదు!

  • విజయవాడలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఘటన
  • వైసీపీ అభ్యర్థుల తరఫున కోగంటి సత్యం ప్రచారం
  • అడ్డుకున్న ఉమ, ఆయన కుమారులు

టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమపై కేసు నమోదయింది. వైసీపీ అభ్యర్థులు పొట్లూరి వరప్రసాద్, మల్లాది విష్ణు తరఫున పారిశ్రామికవేత్త కోగంటి సత్యం గతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వీరి ప్రచారాన్ని బోండా ఉమ కుమారులు సిద్ధార్థ్, రవితేజ టీడీపీ కార్యకర్తలతో కలిసి అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ఘటనాస్థలికి చేరుకున్న బోండా ఉమ సత్యంతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా చంపేస్తానని ఆయన్ను బెదిరించారు. ఈ మేరకు కోగంటి సత్యం విజయవాడలోని సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరోవైపు కోగంటి సత్యం ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 341,506 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News