IG: విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా: ఏబీ వెంకటేశ్వరరావు

  • ‘ఈ-ప్రగతి’తో నాకు, మా కుటుంబానికి సంబంధం లేదు
  • ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు, సబ్ కాంట్రాక్టులతో కూడా
  • విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నా

ఈ-ప్రగతి సంస్థతో ఏపీ ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులకు సంబంధాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను ఏబీ వెంకటేశ్వరరావు ఈ రోజు ఖండించారు. ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు, సబ్ కాంట్రాక్టులతో తనకు, తన కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు.

 ఈ-ప్రగతి ప్రాజెక్టుతో తమకు ఎటువంటి సంబంధం లేదని, విజయసాయిరెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని, ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కాగా, నిన్న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని  విజయసాయిరెడ్డి, ఆయన బృందం కలిసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి ఈ ఆరోపణలు చేశారు.

More Telugu News