Hyderabad: ప్రేమ పేరిట వేధింపులు.. కేపీహెచ్ బీ లో విషం తాగి యువతి మృతి

  • కేపీహెచ్ బీ కాలనీ ఫేజ్-9లో నివసిస్తున్న యువతి జ్యోతి
  • శీతల పానీయంలో విషం కలుపుకుని తాగిన వైనం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ఓ వ్యక్తి ప్రేమ పేరిట వేధింపులకు పాల్పడటంతో మనస్తాపం చెందిన యువతి విషం తాగి మృతి చెందింది. హైదరాబాద్ శివారు కేపీహెచ్ బీ కాలనీలో ఈ విషాద ఘటన జరిగింది. కేపీహెచ్ బీ కాలనీ ఫేజ్-9లో యువతి జ్యోతి, తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ప్రేమ పేరిట వేధింపులు ఎక్కువ కావడంతో ఆవేదన చెందిన ఆ యువతి, శీతల పానీయంలో విషం కలుపుకుని తాగింది. ఈ విషయం గమనించిన ఆమె కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.

కాగా, ఈ ఘటనపై యువతి తండ్రి స్పందిస్తూ, రాకేశ్ రెడ్డి అనే వ్యక్తి వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. ఈ మేరకు కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

More Telugu News