chennai: ప్రధాని మోదీ హయాంలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయి: ఏపీ సీఎం చంద్రబాబు

  • రాఫెల్ కుంభకోణంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు
  • ఇలాంటి వాళ్లు దేనికైనా తెగిస్తారు
  • 50 శాతం వీవీప్యాట్స్ స్లిప్పులు లెక్కించాల్సిందే

ప్రధాని మోదీ హయాంలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయని  ఏపీ సీఎం చంద్రబాబు దుమ్మెత్తిపోశారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేతలతో కలిసి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాఫెల్ కుంభకోణంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చినవారు దేనికైనా తెగిస్తారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను పరిరక్షించాలని, అందుకోసం చాలా రోజులుగా  పోరాడుతున్నానని అన్నారు. 50 శాతం వీవీప్యాట్స్ స్లిప్పులు లెక్కించాల్సిందేనని, ఈ విషయమై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. చాలా దేశాల్లో బ్యాలెట్ విధానం ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

More Telugu News