sai dharam tej: సాయిధరమ్ తేజ్ కి ఊరట .. 4 రోజుల్లో 20 కోట్లు రాబట్టిన 'చిత్రలహరి'

  • తేజు నుంచి వచ్చిన ప్రేమకథా చిత్రం
  •  యూత్ నుంచి మంచి రెస్పాన్స్ 
  • లాభాలకి దగ్గరలో వసూళ్లు

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' తెరకెక్కింది. కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ నాయికలుగా నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందేశంతో కూడిన ఈ ప్రేమకథా చిత్రానికి అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. బయ్యర్ల పెట్టుబడిలో 80 శాతం వెనక్కి వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా లాభాల బాట పడుతుందని అంటున్నారు. కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతోన్న సాయిధరమ్ తేజ్ కి, ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ ఎంతో ఊరట కలిగిస్తోందని అంటున్నారు. అమెరికాలో వసూళ్లు పుంజుకుంటే, ఈ పాటికే లాభాల బాట పట్టేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ కి ఈ సినిమా హిట్ అందిస్తుందేమో చూడాలి మరి.

More Telugu News