Team India: తండ్రి, సోదరి కాంగ్రెస్‌లో.. తన ఓటు మాత్రం బీజేపీకేనన్న టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా

  • గత నెలలో బీజేపీలో చేరిన జడేజా భార్య రివాబా
  • ఆదివారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న జడేజా తండ్రి, సోదరి
  • తాను మాత్రం తన భార్యవైపేనంటూ జడేజా ట్వీట్

తన తండ్రి, సోదరి కాంగ్రెస్‌లో చేరినప్పటికీ తన ఓటు మాత్రం బీజేపీకేనని టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్పష్టం చేశాడు. ‘‘ఐ సపోర్ట్ బీజేపీ’’ అంటూ ట్వీట్ చేశాడు. గత నెలలో జడేజా భార్య రివాబా జడేజా బీజేపీలో చేరారు. రివాబా రాజకీయ ప్రవేశం గతేడాది మొదలైంది. అక్టోబరులో ఆమె కర్ణిసేనలో చేరి గుజరాత్ మహిళా వింగ్‌కు అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అయితే, ఆ తర్వాత మనసు మార్చుకున్న రివాబా గత నెల 3న బీజేపీ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

మరోవైపు, రవీంద్ర జడేజా తండ్రి అనురుధ్ సిన్హ్, సోదరి నైనాబాలు ఈ నెల 14న కాంగ్రెస్‌లో చేరి జడేజాకు షాకిచ్చారు. దీంతో ఒకే కుటుంబంలో ప్రత్యర్థులు పుట్టుకొచ్చారు. ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా ఎటువైపు నిలుస్తాడన్న చర్చ జోరుగా సాగింది. దీంతో తాజాగా ఈ చర్చకు ఫుల్‌స్టాప్ పెడుతూ తాను తన భార్యవైపేనని స్పష్టం చేశాడు. తన మద్దతు బీజేపీకేనంటూ ట్వీట్ చేశాడు.

More Telugu News