Andhra Pradesh: కృష్ణా జిల్లాలో బస్సు ప్రమాదం.. ఇద్దరు డ్రైవర్ల మృతి

  • పెనుగంచిప్రోలులో ఘటన
  • ఘటనా స్థలంలోనే మృతి చెందిన ఇద్దరు డ్రైవర్లు 
  • నందిగామ ఆసుపత్రికి క్షతగాత్రులు

కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెనుగంచిప్రోలు మండలంలోని తోటచర్ల వద్ద ఈ ఘటన జరిగింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనా స్థలంలోనే ఇద్దరు డ్రైవర్లు మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే నందిగామ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News