YSRCP: ఈవీఎంల దొంగ హరిప్రసాద్ జైలుకు కూడా వెళ్లొచ్చాడు: విజయసాయిరెడ్డి

  • మోసాలకు మారుపేరు హరిప్రసాద్
  • అతని మాటలను ఎవరూ నమ్మరు
  • ఏ రాజ్యాంగ సంస్థ కూడా అతన్ని అనుమతించదు

ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్ పై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో సీఈసీని కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈవీఎంల దొంగ హరిప్రసాద్ అని, ఈ కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చాడని అన్నారు. ‘చంద్రబాబు తొత్తులు, చంద్రబాబు సోషల్ మీడియా కలసి, నేను ట్విట్టర్ లో మెస్సేజ్ లు పెట్టినట్టుగా దొంగ మెసేజ్ లు పెట్టి దుష్ప్రచారం చేశారు. ఏదైనా, మేనిప్లేట్ చేయగలిగిన వ్యక్తి, మోసాలకు మారుపేరు ఈ హరిప్రసాద్. ఏ రాజ్యాంగ సంస్థ కూడా అతన్ని అనుమతించదు. అతని మాటలను ఎవరూ నమ్మరు. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ కాబట్టి ఆ పార్టీలోకి అతనికి ప్రవేశం ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా అతన్ని ఎంటర్టైన్ చేయదు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News