amaravathi: అమరావతి నుంచి కర్ణాటకకు బయలుదేరిన చంద్రబాబు

  • కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి బహిరంగ సభ
  • పాండవ స్టేడియంలో నిర్వహించనున్న సభ
  • ఈ సభకు హాజరుకానున్న కుమారస్వామి, దేవెగౌడ

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ఈరోజు నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఈ క్రమంలో కొద్ది సేపటి క్రితం అమరావతి నుంచి కర్ణాటకకు చంద్రబాబు బయలుదేరారు. మాండ్యా జిల్లాలోని పాండవ స్టేడియంలో నిర్వహించనున్న ఈ బహిరంగ సభలో సీఎం కుమారస్వామి, జేడీఎస్ అధినేత దేవెగౌడ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. కాగా, కర్ణాటకకు బయలుదేరి వెళ్లడానికి ముందు విలేకరులతో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ తీరుపై ఆయన మండిపడ్డారు.

More Telugu News