Uttar Pradesh: తల్లిని చెట్టుకు కట్టేసి ఆమె కళ్ల ముందే కుమార్తెపై సామూహిక అత్యాచారం!

  • ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఘటన
  • మందుల షాపుకెళ్లిన తల్లీకుమార్తెల కిడ్నాప్
  • తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు

ఉత్తరప్రదేశ్ లో కామాంధులు రెచ్చిపోయారు. మందుల షాపుకు వెళ్లివస్తున్న తల్లీకుమార్తెలను కిడ్నాప్ చేసి తల్లి కళ్ల ముందే కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఘటనాస్థలి నుంచి పరారయ్యారు. ఈ ఘటన ముజఫర్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కాక్రౌలీ ప్రాంతానికి చెందిన యువతి మందులు కొనేందుకు తల్లితో కలిసి మెడికల్ షాపుకు వచ్చింది. అనంతరం తిరిగివెళుతుండగా, ఇద్దరు యువకులు వారిని కిడ్నాప్ చేసి సమీపంలోని చెరకు తోటలోకి ఈడ్చుకెళ్లారు.

ఆ తర్వాత తల్లిని అక్కడే ఓ చెట్టుకు కట్టేసి కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. దీంతో తల్లితో కలిసి ఇంటికి చేరుకున్న బాధితురాలు ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. ఈ నేపథ్యంలో తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న యువతి నిందితులపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News