nagababu: 'జబర్దస్త్' షో ను మాత్రం వదిలేది లేదు: నాగబాబు

  • 'జబర్దస్త్' అంటే నాకెంతో ఇష్టం
  • నాకు ఉపశమనం కలిగించే షో అది
  •  ఎంపీగా గెలిచినా 'జబర్దస్త్' చేస్తూనే వుంటాను  

ఈటీవీలో అత్యధిక రేటింగుతో కొన్నేళ్లుగా 'జబర్దస్త్' కామెడీ షో కొనసాగుతోంది. ఈ కామెడీషోకి న్యాయనిర్ణేతలుగా నాగబాబు - రోజా వ్యవహరిస్తున్నారు. ఈ షో నాన్ స్టాప్ గా నవ్వులు పూయించడంలో ఈ ఇద్దరి పాత్ర ఎంతో వుంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు .. 'జనసేన' పార్టీలో చేరడం .. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగిపోయాయి. దీంతో ఇక రాజకీయాలపైనే నాగబాబు దృష్టిపెట్టనున్నారనీ, ఆయన జబర్దస్త్' చేయకపోవచ్చుననే ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంపై ఆయన స్పందిస్తూ .. 'జబర్దస్త్' అంటే నాకు చాలా ఇష్టం .. ఎన్నో సమస్యల నుంచి బయటపడటానికి అది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నెలకి నాలుగు రోజులు మాత్రమే షూటింగు ఉంటుంది. ఆ నాలుగు రోజులు ఎలాగో అలా నేను సర్దుబాటు చేసుకుంటాను. ఒకవేళ ఎంపీగా గెలిచినా ఈ షో చేయడం మానుకోను .. న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూనే ఉంటాను. రాజకీయ రంగంలో ఒకవైపున పదవులు నిర్వహిస్తూనే .. మరో వైపున టీవీ షోలకి న్యాయనిర్ణేతలుగా పనిచేసిన వాళ్లు చాలామందే వున్నారు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News