Chandrababu: కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గంలో రేపు చంద్రబాబు ప్రచారం

  • సాయంత్రం 4 గంటలకు సభ
  • ఇక్కడి నుంచి జేడీ(ఎస్‌) తరపున పోటీ చేస్తున్న దేవెగౌడ మనవడు 
  • స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న సినీనటి సుమలత

సొంత రాష్ట్రంలో ఎన్నికలు పూర్తికావడంతో మిత్రపక్షాల తరపున ఇతర రాష్ట్రాల్లో ప్రచారంపై చంద్రబాబు దృష్టిసారించారు. తొలుత కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో రేపు ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నియోజక వర్గంలో జేడీ(ఎస్‌) అభ్యర్థిగా స్వయంగా మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్‌ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయనకు ప్రత్యర్థిగా సినీనటి సుమలత బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరనున్న సీఎం సాయంత్రం 4 గంటలకు మాండ్య జిల్లాకు చేరుకుని ప్రచారం నిర్వహిస్తారు. పాండవపురం పట్టణంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 

More Telugu News