Andhra Pradesh: ఏపీలో టీడీపీకి 130 అసెంబ్లీ, 20 లోక్ సభ సీట్లు రాబోతున్నాయ్!: మంత్రి కొల్లు రవీంద్ర జోస్యం

  • చంద్రబాబుకు ప్రజలు మరోసారి పట్టం కట్టబోతున్నారు
  • సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయి
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి చంద్రబాబుకు పట్టం కట్టబోతున్నారని టీడీపీ నేత, మంత్రి కొల్లు రవీంద్ర జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో గెలిపిస్తాయని వ్యాఖ్యానించారు. ఈరోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో 130 అసెంబ్లీ, 20 లోక్ సభ స్థానాలను టీడీపీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు పాలనను ప్రజలు కోరుకుంటున్నారని కొల్లు రవీంద్ర  వ్యాఖ్యానించారు.

More Telugu News